Blog

అందరికీ విద్య vishnu

విద్య ప్రాధమిక హక్కు

అందరికీ విద్య

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు,యువకులు,వయోజనులందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనేది ఇప్పుడు ఉద్యమ స్థాయిని అందుకుంది. ఈ ఉద్యమాన్ని 1990లో జరిగిన అందరికీ విద్య అనే అంశం మీద ప్రపంచ స్థాయి సమావేశాలలో నిర్ణయించి ప్రారంబించారు.

పదేళ్ల తర్వాత చాలా దేశాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. ఆఫ్రికాలోని సెనిగల్ దేశ రాజధాని డాకార్లో జరిగిన సమావేశానికి వివిధ దేశాల నుండి ప్రతినిధులు వచ్చి 2015 నాటికి అందరికీ విద్య సాధించాలని నిర్ణయించారు. పిల్లలూ, యువకులూ, వయోజనుల కొరకు ఆరు అభ్యాస అవసరాలను గుర్తించారు. ఈ పథకాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శి పాత్ర వహిస్తున్న యునెస్కో అంతర్జాతీయంగా సమన్వయ పాత్ర పోషిస్తూ అందరికీ విద్య తగిన ఏర్పాట్లను చేపట్టి నిర్వహిస్తున్నది. ప్రభుత్వాలను, అభివృద్ధి సంస్థలను, పౌరసమాజాన్ని, స్వచ్ఛంద సంస్ధలను, ప్రచార సాధనాలను సమీకరించి సమన్వయ పరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నడుం బిగించింది.

ఇప్పుడు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్) సాధించడానికి అందరికీ విద్య ఎంతో ప్రయోజన పడుతుందంటున్నారు. ఈ లక్ష్యాల్లో, లక్ష్యం నెంబరు ఒకటి సార్వత్రిక, ప్రాథమిక విద్యకు సంబంధించినవి. లక్ష్యం నెంబరు రెండు విద్యా రంగంలో లింగ వివక్షత లేకుండా సమానతను సాధించడం. ఈ లక్ష్యాలను 2015 నాటికల్లా సాధించి తీరాలన్నది ఒక ముఖ్యమైన ధ్యేయం.

గ్రామీణులందరూ విద్య ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకొని వ్యవహరించాలనేది ప్రధానం.

ఈ క్రింది సమాచారాన్ని ప్రజలందరూ పట్టించుకొని మెలగాలి.

  • ఆడపిల్లలను చదివించాలి.
  • బ్రిడ్జి కోర్సులు ద్వారా బాల కార్మికులకు విద్య అందించాలి
  • షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులవారు, అల్పసంఖ్యాక వర్గాల వారి కందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి.
  • మానసిక, శారీరక, అంగవైకల్యాలు గల – అవిటి, చెవిటి, మూగ, అంధులు – వీరందరికీ విద్యావసతులు కల్పించాలి.
  • మహిళలు చదువుకునేటట్టు ప్రోత్సహించాలి

ఆరు ప్రత్యేక విద్యా లక్ష్యాలు

  • విశేషం గాను, అధికంగా నిర్లక్ష్యానికి గురైన మరియు అణగారిన వర్గాల పిల్లల కొరకు శిశు రక్షణ , పూర్వ ప్రాథమిక విద్యను విస్తృత పరుస్తూ సమగ్రంగా మెరుగుపరచడం.
  • పిల్లలందరు 2015 నాటికి , ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలోగల, మరియు సాంసృతికంగా అల్ప సంఖ్యాక వర్గాలలోని, భిన్న జాతులలోని బాలికలకు పాఠశాలలు అందుబాటులో ఉండడం, నాణ్యమైన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం, దానికి కావలసిన సౌకర్యాలను కల్పించటం.
  • సరైన అభ్యసనం మరియు జీవన నైపుణ్యాలు కార్యక్రమంలో పిల్లలు మరియు వయోజనులు, అందరూ సమానంగా అభ్యసనావసరాలు పొందడం
  • ప్రధానంగా మహిళలకు మరియు వయోజనులందరికీ ప్రాథమిక మరియు నిరంతర విద్య సమానంగా అందించడం ద్వారా 50% అభివృద్దితో మెరుగైన వయోజన విద్యను 2015 నాటికి సాధించడం.
  • ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలో 2015 నాటికి లింగ వివక్షను తొలగించడం, బాలబాలికలందరికీ నాణ్యమైన విద్యను సమానంగా సాధించడం, మెరుగైన ప్రాథమిక విద్యను సాధించడంలో పూర్తిగాను సమానంగాను బాలికలపై దృష్టి పెట్టి అందించడం.
  • అన్ని విధాలుగా మెరుగుపరచిన నాణ్యమైన విద్యను సాధించడం, వారందరికి ముఖ్యంగా చదవటం, రాయటం, లెక్కించడం మరియు అవసరమగు జీవన నైపుణ్యాలలో గుర్తించదగిన అత్యుత్తమ మైన వాటినన్నింటినీ మరియు కొలవదగిన అభ్యసన ఫలితాలను పొందడం.

బాలల హక్కు చట్టం

ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు చట్టం 2009. భారత పార్లమెంట్ చేసిన ఈ చట్టం 2009 ఆగష్టు 29న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్భంద విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మినహాయించి ఇది భారత దేశమంతటికీ వర్తిస్తుంది.

ఈ బాలల హక్కు చట్టం యొక్క సంపూర్ణ వివరాలు ఇక్కడ జత చేయబడిన పి.డి.ఎఫ్ ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు నిబంధనలు ఆంధ్రప్రదేశ్ 2010

ఈ నిబంధనలను ఉచిత నిర్భంద విద్యకు బాలల హక్కు నిబంధనలు – 2010 అని పిలుస్తారు. ఈ నిబంధనలు 01-04-2010 నుండి అమలులోకి వచ్చాయి.

ఈ చట్టం యొక్క పూర్తి సమాచారం క్రింద జత చేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంది. ఈ పి.డి.ఎఫ్. లో ఈ శీర్షికల సమాచారం అందుబాటులో ఉంది.

బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ, చట్టం ప్రకారం విద్యా వసతుల అందుబాటు, రాష్ట్ర ప్రభుత్వ / స్థానిక ప్రభుత్వ విధులు, స్థానిక అథారిటీ నిర్వహించాల్సిన పిల్లల రికార్డులు, పాటశాల గుర్తింపు, తాత్కాలిక ధృవీకరణ, పాటశాల యాజమాన్య కమిటీ, పాటశాల అభివృద్ధి ప్రణాలిక రూపకల్పన, ప్రైవేటు పాటశాల ఉపాధ్యాయుల వేతనం, అలవెన్సులు, సర్వీసు నిబంధనలు, ఉపాధ్యాయుల విధులు, విద్యార్థి : ఉపాధ్యాయ నిష్పత్తిని కొనసాగించటం, పాట్య ప్రణాళిక, మూల్యాంకన విధానం, విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ విధులు, రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు మరియు విధులు. పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందుకు అందరికీ విద్య ముఖ్యమైనది?

ఎనిమిది ( 8 ) మిలీనియమ్ డెవలప్ మెంట్ లక్ష్యాలను ( MDGs) పొందడంలో అందరికీ విద్యా లక్ష్యాలన్నింటినీ సాధించడమనేది క్లిష్టమైనది. ఎందుకంటే ఇది నేరుగా పిల్లవాని/ పిల్ల యొక్క విద్య మరియు ఆరోగ్యం సమకూర్చడం పై ప్రభావం ఉంటుంది. అలాగే అందరికీ విద్య 2015 నాటికి లక్ష్యాలను చేరడానికి బహుళ భాగస్వాములతో కలిసి పనిచేయడం అనే అనుభవం కల్పిస్తుంది. ఇతర మిలీనియమ్ డెవలప్ మెంట్ లక్ష్యాలను ( MDGs) , ఈ శతాబ్దపు అభివృద్ధి లక్ష్యాలు) సమాంతరంగా సాధించవచ్చును. అవేమిటంటే ఆరోగ్యాన్ని మెరుపరచుకోవడం, పరిశుభ్రమైన మంచినీరు అందుబాటు లో ఉంచడం, పేదరికాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, చదువును సాధించడమనే ఈ లక్ష్యాలన్నింటిలోను విద్య క్లిష్టమైనది.

అయినప్పటికినీ, సవాళ్ళు ఉన్నను, అందరికీ విద్య లక్ష్యాలను ఎక్కువగా సాధించడంలో ప్రగతి నిలకడగా కన్పిస్తున్నది. నేడు, ఆర్ధికంగా సామాజికంగా లేదా భౌతిక సవాళ్ళతో బాటు, అధిక సంతానం, హెచ్ ఐ వి /ఎయిడ్స్ బాధితులు, సంఘర్షణలను ఎదుర్కొనేవారు చాలా మంది బడి ఈడు పిల్లలు బడిలో ఉండడంలేదు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో 1990 నుండే పాఠశాల అందుబాటులో ఉండడం మెరుగైనదే, కాని 163 దేశాలలో 47మాత్రం సార్వత్రిక ప్రాథమిక విద్యను (MDG 2)ను సాధించాయి. ఇంకనూ 20 దేశాలు 2015 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడాని ప్రయాణిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. అయిననూ 44 దేశాలలో పెద్ద ఎత్తున సవాళ్ళు ఉన్నాయి. ఇందులో 23 దేశాలు సబ్- సహారన్ ఆఫ్రికాలో ఉన్నాయి. స్వదేశంలోను మరియు అంతర్జాతీయంగా త్వరితగతిలో సంతృప్తికరమైన ప్రయత్నాలు చేస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను 2015 నాటికి సాధించలేకపోవచ్చు.

చదువులో లింగవివక్ష తగ్గినప్పటికిని (MDG 3) పాఠశాలలు అందుబాటులో ఉన్నను, ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పూర్తి చేయడంలో బాలికలు ఇంకను నిర్లక్ష్యానికి గురి అవతున్నారు. ఇటీవల ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో బాలికల నమోదు పెరిగినప్పటికిని- ముఖ్యంగా సబ్ -సహారన్ ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలోని అల్ప ఆదాయ దేశాలు – అందులో 24 దేశాలు లింగ వివక్ష లేకుండా ప్రాథమిక లేదా మాధ్యమిక స్థాయిలో 2015 నాటికి సాధించలేవు. ఇందులో ఎక్కువ దేశాలు (13) సబ్- సహారన్ ఆఫ్రికాలో ఉన్నాయి.

అభ్యసన ఫలితాలు తక్కువగాను, అల్ప నాణ్యతా విద్య ఇంకనూ ఉండడం వలన విద్యా విభాగం తక్కువ స్థాయిలో ఉన్నది. ఉదాహరణకు చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటి గ్రేడులో నమోదైన విద్యార్ధులు చివరి గ్రేడు చదువుకు వచ్చేటప్పటికి 60% కన్నా తక్కువగా ప్రాథమిక పాఠశాలలో ఉంటున్నారు. అదనంగా విద్యార్ధి / ఉపాధ్యాయ నిష్పత్తి చాలా దేశాలలో 40: 1 కి మించి ఉంది. తగిన యోగ్యత లోపించిన ప్రాథమిక ఉపాధ్యాయులూ చాలా మంది ఉన్నారు.

అందరికి విద్యకు సంబంధించిన మరింత సమాచారం కొరకు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2014 – 15 కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు

ప్రాథమిక విద్య:

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక విద్యకు రూ.55,115.10 కోట్లు కేటాయించారు. 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.50,136.30 కోట్లుగా ఉంది.
  • ప్రాథమిక విద్య తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఎన్డీయే ప్రభుత్వం పేర్కొంది. తొలిదశలో అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొత్తంగా విద్యారంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం కేటాయింపులు పెరిగాయి.
  • పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగాలకు రూ.51,828 కోట్లు కేటాయించారు. (విద్యా రంగం మొత్తానికి రూ.68,728 కోట్లు)
  • సర్వశిక్ష అభియాన్‌కు రూ.28,635 కోట్లు.
  • రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు.
  • ఉపాధ్యాయుల్లో ప్రేరణకు, నూతన బోధనా విధానాల అభివృద్ధికి ‘పండిట్ మదన్‌మోహన్ మాలవ్య’ పేరిట ప్రత్యేక కార్యక్రమం. దీనికి ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించారు.
  • మదర్సాల ఆధునికీకరణకు రూ.100 కోట్లు.
  • పాఠశాలకు వెళ్లాల్సిన 5-11 ఏళ్ల లోపు పిల్లల్లో ప్రపంచవ్యాప్తంగా 5.78 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. వీరిలో మన దేశానికి చెందినవారు 14 లక్షల మంది ఉన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు అధికంగా ఉన్న తొలి అయిదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.

ఉన్నత విద్య:

  • ఉన్నత విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.25,456 కోట్లు కేటాయించారు. 2013 – 14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.24,485 కోట్లు.
  • దేశంలో కొత్తగా అయిదు ఐఐటీలు, అయిదు ఐఐఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
  • కొత్త ఐఐటీలు జమ్మూ, చత్తీస్‌గఢ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఏర్పాటు చేయనున్నారు.
  • ఐఐఎంలు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు.
  • మధ్యప్రదేశ్‌లో ‘జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్’ ఏర్పాటు.
  • ఆన్‌లైన్ కోర్సులు, వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు రూ.100 కోట్లు.
  • విద్యా రుణాల నిబంధనల సరళీకరణకు నిర్ణయం.
  • యూపీఎస్‌సీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయింపు.
  • ఉన్నత విద్యలో చేరుతున్న యువతీ యువకుల సంఖ్య 2.7 కోట్లు. దేశంలోని 18-23 ఏళ్ల వయసున్న యువతలో ఇది 17.21 శాతం. 2020 నాటికి ఈ సంఖ్యను 4.5 కోట్లకు (25శాతం) పెంచాలని యూజీసీ ప్రతిపాదించింది.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

పేజీకి రేటింగ్ (29 ఓట్లు)

2.62068965517
రేటింగ్:

రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి

G ANAND KUMAR Mar 07, 2014 12:33 PM

ప్రభుత్వ పాటశాలలో చదివే వారికీ ఉన్న వివరాలు అందచేయండి.

ch surya narayana prasad Mar 31, 2015 03:01 PM

ఈ రోజులో గ్రామీణ ప్రాంతంలో ఎడ్యుకేషన్ చాలా కష్టంగా మారింది. ముక్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సిటీ నుండి వచ్చే విద్యార్థులు అనగా గ్రామం నుండి సిటీ కి 30 కిలోమీటర్ దూరం నుండి వచ్చే విద్యార్థులు బస్సులో రావడం, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కావున గ్రామం లోనే ఇంగ్లీష్ స్కూల్ లను ఏర్పాటు చేశ్తే బాగుంటుంది.

B.Subahan sgt asst Mar 31, 2015 03:02 PM

ఈ నాటి స్కులల్లో నైతిక విలువలు పెరగాలంటే తల్లిదండ్రులలో మార్పు రావాలి. తల్లిదండ్రులు పిల్లలను దగ్గర తీసుకొని నేటి కథలు సమాజం పట్ల గౌరవం పెరిగే విదంగా మాట్లాడించడం, బంధుత్వాలను పెంపొందించుకోవడం, వివిధ మతాల పట్ల సామరస్య దొరని పెంపొందించే విదంగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోస్తహించాలి.

kanakadurga Mar 31, 2015 03:05 PM

చదువులు చావును దగ్గర చేస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం కేవలం ఫీజులకిచ్చే ప్రాధాన్యత పిల్లల పట్ల వారి క్షేమం పట్ల చూపించటం లేదు. ప్రభుత్వాలు కూడా వారి భాద్యతను మరిచారు ఎక్కడ ప్రమాదాలు వున్నాయి వాటినుండి ప్రజలను కాపాడే దిశగా ప్రయత్నాలు చేయాలి. విద్యావిధానంలో పిల్లలపై భారం ఎక్కువ అయింది. వయసుకి మించిన పుస్తకాల బరువు మారుతున్న టెక్నాలజీ పేరుతొ అధిక వత్తిడికి పిల్లలు గురౌతున్నారు. ఆట పాటలకు దూరం, టైం కుదరని స్కూల్ వేళలు మారని విధ్యావిదానం.

ఆరు ప్రత్యేక విద్యా లక్ష్యాలు

  • విశేషం గాను, అధికంగా నిర్లక్ష్యానికి గురైన మరియు అణగారిన వర్గాల పిల్లల కొరకు శిశు రక్షణ , పూర్వ ప్రాథమిక విద్యను విస్తృత పరుస్తూ సమగ్రంగా మెరుగుపరచడం.
  • పిల్లలందరు 2015 నాటికి , ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలోగల, మరియు సాంసృతికంగా అల్ప సంఖ్యాక వర్గాలలోని, భిన్న జాతులలోని బాలికలకు పాఠశాలలు అందుబాటులో ఉండడం, నాణ్యమైన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం, దానికి కావలసిన సౌకర్యాలను కల్పించటం.
  • సరైన అభ్యసనం మరియు జీవన నైపుణ్యాలు కార్యక్రమంలో పిల్లలు మరియు వయోజనులు, అందరూ సమానంగా అభ్యసనావసరాలు పొందడం
  • ప్రధానంగా మహిళలకు మరియు వయోజనులందరికీ ప్రాథమిక మరియు నిరంతర విద్య సమానంగా అందించడం ద్వారా 50% అభివృద్దితో మెరుగైన వయోజన విద్యను 2015 నాటికి సాధించడం.
  • ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలో 2015 నాటికి లింగ వివక్షను తొలగించడం, బాలబాలికలందరికీ నాణ్యమైన విద్యను సమానంగా సాధించడం, మెరుగైన ప్రాథమిక విద్యను సాధించడంలో పూర్తిగాను సమానంగాను బాలికలపై దృష్టి పెట్టి అందించడం.
  • అన్ని విధాలుగా మెరుగుపరచిన నాణ్యమైన విద్యను సాధించడం, వారందరికి ముఖ్యంగా చదవటం, రాయటం, లెక్కించడం మరియు అవసరమగు జీవన నైపుణ్యాలలో గుర్తించదగిన అత్యుత్తమ మైన వాటినన్నింటినీ మరియు కొలవదగిన అభ్యసన ఫలితాలను పొందడం.

విష్ణు వర్ధన్(శాస్త్రవేత్తలు)

ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
ఎస్.కె. మిత్రా (1890 – 1963)

చిన్ననాటి అనుభావాలు, ఆసక్తి పెద్దయ్యాక మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.ఎస్.కె.మిత్రా అటువంటి అసాధారణ శాస్త్రవేత్త చిన్నప్ఫుడు చూసిన సంగతుల గూర్చి బాల్యదశలోనే సంగతుల గూర్చి బాల్యదశలోనే ఆసక్తిని పెంచుకున్న మహామనిషి.అది కలకత్తాలోని ఒక మైదానం. ఆర్.సి.ఛటర్జీ అనే ఆయన బెలూన్లో ఆకాశయానం చేస్తుండగా 9 సం”ల బాలుడు మాత్రం ఆశ్చర్యంగా అదెలా సాధ్యం అయింది?” అని తన ప్రక్కనే ఉన్న తన అతని అన్నను అడిగాడు. అన్నగారు సమాధానం చెప్పలేక పోయారు. ఇంటికి వచ్చి సైన్సు పుస్తకాలలో వెతికాడు.ఆ బాలుడే శిశిర్ కుమార్ మిత్రా 1890 అక్టోబరు 24వ తేదీన అతడు కలకత్తాలో జన్మించాడు.చిన్ననాటి నుంచే అతను చాలా శ్రద్ధగా చదివేవాడు.కాలేజీ విద్యాభ్యసన కాలంలో జె.సి.బోస్,పి.సి.రే వంటి ప్రముఖుల పరిశోధనలు అతన్నీ ప్రభావతం చేశాయి.ఆ ప్రేరణలోనే మిత్రా ” రేడియోసైన్స్ ” ని అధ్యయనం చేయాలనుకున్నాడు. రేడియో శాస్త్రం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించిన మిత్రా ప్రోద్బలం మీదనే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఈ శాస్త్రభోదనావకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అయనోస్పియర్ గురించి మిత్రా చేసిన పరిశోధనలే ఆయనకి విజ్ఞానశాస్త్రంలో పేరుతెచ్చాయి. భూమి యొక్క వాతావరణపు పైపొర ‘ అయనోస్పియన్ ‘ దీనిలో విద్యుదావేశం కల రేణువులు ఉంటాయి. వీటినే అయానులు అని అంటారు. రేడియో కమ్యూనికేషన్ రంగంలో అయానోస్పియన్ మండలం పాత్రవిశిస్టమైనది. భూమి నుంచి ఎత్తు అయానులస్వభావం ప్రాతిపదికగా అయాను మండలాన్ని D-E-F అని మూడు రకాలుగా విభజించారు.

ఈ పొరల గురించి మిత్రా విశిష్టమైన పరిశోధనలు చేశారు. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల చర్య వలన అయాను మండలంలో “E” పొర ఏర్పడినదని ఆయన చెప్పాడు. ఈ పొర గురించి అప్పటి వరకు ప్రపంచ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు చేస్తూవచ్చారు. మిత్రా పరిశోధన వారి అనుమానాలకి పుల్ స్టాఫ్ పెట్టింది.1958లో మిత్రాని రాయల్ సొసైటి ఫెలోగా ఎన్నుకొన్నారు.ఆయన పలుబహుమానాలు , పతకాలు గెలుపొందారు. భూ ఉపరితలపు వాతావరణం గురించి 1947లో ఆయన The upper Atmosphere అనే గ్రంథం రాశాడు. ఈ అంశంపై ఇదే తొలిగ్రంథం కావటం విశేషం. అది ప్రపంచ వ్యాపితంగా శాస్త్రవేత్తల ప్రశంసలను అందుకుంది.1963 ఆగష్టు 13వ తేదీన తన 73వ ఏట శిశిర్ కుమార్ మిత్రా మరణించారు.

భూవాతావరణం గురించి,అయాను మండంలం గురించి యేన్నే చిన్న పరిశోధన వెలుగు చూసినా అందులో శిశిర్ కుమార్ మిత్రా పేరు తళుక్కున మెరుస్తుంది.

శాంతిస్వరూప్ భట్నాగర్

శాంతిస్వరూప్ భట్నాగర్ గురించి తెలియనివారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (CSIR) వారు ఏటేటా ఇచ్చే శాంతిస్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్ధం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్.
ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో ఫిబ్రవరి 21, 1894న భట్నాగర్ జన్మించాడు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ళ తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది. ఇప్పటి పాకిస్తాన్లొ ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగామారి, డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు.

ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతిసులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురుకలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత(Viscosity) తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా! భట్నాగర్ ఔదార్యం.

భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు.

భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.

జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి.

అంతరిక్ష శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు యు.ఆర్.రావు

ప్రంపంచ ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్తలలో ఒకడైన డాక్టరు యు.ఆర్.రావు 1932 మార్చి 10న కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలో అద్మరు అనే గ్రామంలో లక్ష్మీనారాయణరావు కృష్ణవల్లె దంపతులకు జన్నించారు.వీరి పూర్తిపేరు ఉడిపి రామచంద్రరావు. చిన్ననాటినుండే చదువులో తెలివితేటలు ప్రదర్శంచేవాడు.1953లో వారణాసిలోని హిందూ విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యయేషన్, 1960లో డాక్టరు విక్రం సారాబాయి ఆధ్వర్యంలో పి.హెచ్.డి ని పూర్తి చేశాడు. 1961లో విదేశాలకు వెళ్ళాడు.బోస్టన్ లోని మసాచ్యుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ పోస్ట్ – డాక్టోరియల్ ఫెలోషిప్ ను పొందాడు. అక్కడ కాస్మిక్ రేస్, సోలార్ విండ్స్ పై పరిశోధనలు జరిపాడు. 1963 నుండి 1966 వరుకు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.అదే సంవత్సరం భారత్ కు వచ్చి ఫిజికల రీసర్చ్ లేబరేటరీలో సభ్యుడుగా చేరి కాస్మిక్ కిరణాలకు సంబంధించి ఎక్స్-కిరణాలు, గామా కిరణాలపై పరిశోధనలు జరిపాడు.

బెంగుళూరులో ఇస్రోకి డైరెక్టరుగా పనిచేశాడు. ఆర్యభట్ట, భాస్కర్-1, 2 వంటి విజయవంతమైన ఉపగ్రహాలను కనుకొని ప్రయోగించాడు. ఉపగ్రహ సమాచార సౌకర్యార్థం ఎ.ఎస్.ఎల్.వి., పి.ఎస్.ఎల్.వి., జి.ఎస్.ఎల్.వి. వంటి అంతరిక్ష నౌకలను ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు.

అమెరికా ఉపగ్రహాలైన పయనీర్ 1, 2, 6, 7, 8 మరియు 9 లపై అధ్యయనం చేసి 1973లో నాసాగ్రూప్ అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. యూనివర్శిల్ రీసెర్చ్ అవార్డును, పిసి మహల్శోబీస్ మెడల్, యూరీ గెగారియన్ మెడల్, ఆర్యభట్ట అవార్డు ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. భారత ప్రభుత్వం వీరిని “పద్మవిభూషణ్” బిరుదుతో సత్కరించింది. ఈ మహామేధావి నేటికీ అంతరిక్ష పరిశోధనలలో దేశ అభివృద్ధికి పాటుపడుతూనే వున్నారు.

డా.విలియమ్స్

1856లో డేనియల్ హాల్ విలియమ్స్ పుట్టేనాటికి కొంతమంది అమెరికా ఆఫ్రికన్లు ఇంకా బానిసలుగా ఉండేవారు. అయితే అతని తల్లి తండ్రి ఎప్పుడూ బానిసలుగా లేరు. పెన్సిల్వేనియాలో పెద్ద ఇంటిలో వుండే వాళ్ళు అక్కడే వాళ్ళ నాన్న మంగలి షాపు నడిపేవాడు. నాన్న కటింగ్, షేవింగ్ చేస్తూ వుంటే చూస్తూవుండడం బుల్లి విలియమ్స్కు బలే సరదా! అక్కడికి వచ్చే కస్టమర్లు అంతా నల్లవాళ్ళే. వాళ్ళు తాము ఎలా బాధపడిందీ, ఎలా స్వేచ్ఛ పొందిందీ చెపుతూ వుండేవారు. విలియమ్స్కు 11 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చనిపోయారు. ఏదైనా పని వెతుక్కోవడానికి విలియమ్స్ చాలా చిన్నవాడు. అంచేత చెప్పుల తయారీ నేర్చుకోవడానికి బాల్టిమోర్ వెళ్ళాడు. కొంతకాలానికి స్వంత ఊరువచ్చి ఒక మంగలిషాపులో కుదిరాడు.విలియమ్స్కి బడికి పోవాలని కోరికగా వుండేది. దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేవాడు. పనిచేస్తూ డబ్బు దాచుకొని ప్రైవేటు స్కూల్ ద్వారా చదివేవాడు.

21 సంవత్సరాలు వచ్చేటప్పటికీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశాడు. అయినా ఇంకా చదవాలని తపన. ఆ పట్టణంలో ఒక డాక్టరును బ్రతిమాలి అసిస్టెంట్గా చేరాడు. వైద్యానికి సంబంధించిన పుస్తకాలు విరివిగా చదివాడు. రెండు సంవత్సరముల తరువాత చికాగో మెడికల్ కాలేజీలో ప్రవేశించాడు. తదుపరి 3 సంవత్సరాలకు MD డిగ్రీ అందుకున్నాడు. ఆ డిగ్రీ ద్వారా ఇక నుంచి వైద్య వృత్తి చేయడానికి నిజమైన డాక్టరు అయ్యాడు.

డా ” విలియమ్స్కి రోగి నలుపా, తెలుపా అనేది చూసేవాడు కాదు. ఆనీ అప్పట్లో చాలమంది చర్మపు రంగు చూసి వైద్యం చేసేవారు. చాలామంది నల్ల దాక్టర్లకు మల్లే ఇతను పనిచేయడానికి ఏ హాస్పిటలూ అనుమతించలేదు. అనాధశరణాలయంలో డాక్టరుగా, రైల్వే కంపెనీలో సర్జనుగా పనిచేసేవాడు. ఒకానొక కాలేజీలో వైద్య శాస్త్రం బోధించేవాడు. వైద్యం చేయడంలో తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళను చూడకపోవడం విలియమ్స్ను కలవరపర్చింది. పరిస్థితుల్ని మార్చాలనుకొన్నాడు. 1891లో చికాగోలో ప్రావిడెంట్ హాస్పిటల్ నెలకొల్పాడు. అందులో నలుపు, తెలుపు డాక్టర్లు కలిసిపనిచేసేవారు. రోగి చర్మపు రంగుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వైద్యం చేసేవారు.

ప్రావిడెంట్ హాస్పిటల్ ఒక గొప్ప విజయమేకానీ అందులో డా ” విలియమ్స్ చేసిన ఒక ఆపరేషన్ వైద్య చరిత్రలో విఖ్యాతమైనది. 1893లో గుండెలో కత్తి దిగబడివున్న ఒక మనిషిని పరీక్షించాడు. ఆ రోగికి లోపల ఏమైందో తెలుసుకొనే అవకాశం డా” విలియమ్స్కు లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్స్రే మిషన్లు లేవు. “తాను చేయగలిగింది గాయాన్ని తెరిచి చూడడమే.” అని యోచించాడు. అది ప్రమాదమే కానీ ఆ అవకాశం వదులుకుంటే మనిషి చనిపోతాడు. 6 మంది డాక్టర్ల సహకారంతో మనిషి ఛాతీని తెరిచాడు. ఇంకా తెరిచాడు. సమస్యను గుర్తించాడు. తెగివున్న రక్తనాళాన్ని రిపేరు చేశాడు. గుండె చుట్టూ వున్న కండరాల్ని కుట్టేశాడు. మనిషి గుండె కుట్టేయబడింది అనే పెద్ద అక్షరాలతో ప్రపంచం అంతా పేపర్లలో వచ్చింది. మొట్టమొడటి గుండె ఆపరేషన్ను డా” విలియమ్స్ విజయవంతంగా చేశాడు.

పిల్లలూ ! డా” విలియమ్స్ నూతన వైద్య విధానాల్ని కనుక్కోవడానికి ఎంత ధైర్యం చూపేవాడో, వాటిలో విజయం సాధించడానికి అంత జాగ్రత్త వహించేవాడు.

ఆర్ధర్ సి. క్లార్క్

“కాకిలా కలకాలం బతికే కంటే హంసలా ఆరు నెలలు బతికినే చాలు” – అని చెపుతుంది మన తెలుగు వారి సామెత. హంసలాగే కలకాలం బతికిన వారు, అరుదుగానే అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో మనకి దొరుకుతారు. అటువంటి అరుదైన వ్యక్తులలో వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ప్రపంచ ప్రఖాతి గాంచిన ఆర్ధర్. సి. క్లార్క్ ఒకరు. 2007 డిసెంబరు 5వ తేదీనాడు ఆయనకు 90 ఏళ్ళు నిండాయి.”అంతర్జాతీయ టైటాన్” గా పేరు పొందిన క్లార్క్ శ్రీలంకకు పెంపుడు కొడుకు,పుట్టుక రీత్యా ఇంగ్లాండ్లోని ఒక సాధారణ రైతు కుటుంబీకుడు శ్రీలంక,యు.కె.ల రెండిటి పౌరసత్వం పుచ్చుకొన్న ఈయన ప్రపంచ పౌరుడు. “సూర్యుని చుట్టు 90 ప్రదక్షిణాలు పూర్తి చేసిన మీకు ఈ రోజు ఏమనిపిస్తుంది”. అని ఆయనను కొంతమంది స్నేహితులు అడిగారు. ఆ సందర్భంగా ఆయన కొలంబోలోని తన స్వంత ఇంట్లో నుంచి వీడియో ఉపన్యాసం ఇచ్చారు. రోజుకి 15 గం ” నిద్రపోతున్న నాకు సుస్పష్టమైన కలలుకనడానికి బాగా సదవకాశం దొరుకుతోంది. నా శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉన్నప్పటికీ, నా బుర్ర ఈ విశ్వం అంత కలియతిరగడానికి అది ఎంత మాత్రం అడ్డంకి కాదు”. అని చెప్పారు. ఇదే ఆయన ఇచ్చిన చిట్టచివరి వీడియో ఉపన్యాసం. 2008 మార్చి 19వ తేదీ బుధవారం నాడు క్లార్క్ శాశ్వతంగా కన్నుమూశారు.

1962లో ఆయనకు పోలియో వచ్చింది. జీవిత చరమాంకంలో ఆ వ్యాధి లక్షణాలు ప్రబలి క్లార్క్‌ను చక్రాల కుర్చీకి కట్టి పడేసాయి. అయితేనేమిగాక! చివరి దాకా ఆయన టెలిఫొన్, వీడియోల ద్వారా ప్రపంచానికి అందుబాటులోనే ఉన్నారు. పరిపూర్ణమైన, ఫలప్రదమైన అనేకులకు స్పూర్తిదాయకమైన, అత్యంత ఉపయోగకరమైన జీవితాన్ని గడిపారు. 80 ఏళ్ళు నిండిన నాటికే ఆయన వందల కొద్దీ కల్పనిక, అకల్పనిక వైజ్ఞానిక నవలలు, కథలు, వ్యాసాలు రాసారు. తను రాసిన నవలల ఆధారంగా సినిమాలు కూడా తీశారు.

బాలుడిగా క్లార్క్ అకాశంలో నక్షత్రాలను చూస్తూ ఆనందించేవాడు. పల్స్ మేగజైన్‌లలో వచ్చే వైజ్ఞానిక కల్పనా రచనలని చదివేవాడు. ఆయన తల్లి టెలిగ్రాఫిష్ట్‌గాను, తండ్రి టెలిఫోన్ ఇంజనీరుగాను పనిచేశారు. అయితే రెండవప్రపంచ యుద్ధం పూర్తి అయ్యాక క్లార్క్ తండ్రి, తప్పనిసరి పరిస్థితులలో రైతుగా మారాడు. అకాల మరణం పొందాడు. తండ్రి మరణానికి కొద్దిరోజుల ముందే OLAF Step leton రాసిన Last and First Men పుస్తకాన్ని చదివాడు. అది అతనిపై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుండే తాను కూడా వైజ్ఞానిక కల్పనా రచనను చేపట్టాడు.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఓ 30 సంవత్సరాల కాలంలో పరిశీలించి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ముగ్గురంటే ముగ్గురు వైజ్ఞానిక కల్పనా రచయితలు ఉండేవారు. వారు Robert Heinlein, Issac Asimov, Arther. C.clarke వీరు యువతను భాగా ప్రభావితం చేశాడు. యువత అంతరిక్ష శాస్త్రజ్ఞులుగా, ఇంజనీర్లుగా, శాస్త్ర రంగాలలో దిట్టలుగా తయారు కావడానికి వీరి రచనలు బాగా పురిగొలిపాయి. మరీ ముఖ్యంగా నాసాలో చేరిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లపై వీరి ప్రభావం మొండుగా వుంది.

క్లార్క్‌కి గణితంలో మంచి ప్రావీణ్యత వుంది. కాని డబ్బులేని కారణం చేత ఆయన చదువు పాఠశాలలోనే ఆగిపోయింది. మొదట్లో కొన్నాళ్లు ఆడపాదడపా పనిచేసితరువాత ఎలక్ట్రానిక్స్‌లో ట్రయినింగ్ పొంది రాయిల్ ఎయిర్ ఫోర్స్ (RAF) లో రాడార్ స్పెషలిస్ట్‌గా పని చేశారు. ఆ సమయంలో పొందిన అనుభవంతో Glide Path అనే పుస్తకాన్ని రచించారు. ఇది పూర్తిగా వైజ్ఞానిక రచన. యుద్ధానంతరం ఆయన RAF వదిలి కింగ్స్ కాలేజీ లండన్ నుండి భౌతికశాస్త్రం, గణితంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత ఖగోళశాస్త్రంలో పిజి చేశారు. 1945లో ఆయన Wire Less పత్రికలో ఒక వ్యాసాన్ని రాశారు. అందులో Geosynchro nous Satillite Orbit లు సమాచార వ్యవస్థలోనూ, వాతావరణంలో శీతోష్ణ పరిస్థితులను ముందుగా అంచనాలు వేసి తెలుసుకొనేందుకూ బాగా పనికి వస్తాయని చెప్పారు. ఈ పరి కల్పనకు క్లార్క్ ఆద్యుడు కాకపోయినప్పటికీ, ఆయన చేసిన ఈ కృషి వల్లే ఆ రంగం బాగా అభివృద్ధి చెందింది. అందుకే 36 వేల కి.మీ. దూరంలోనూన్న Geosynchro nous Satillite Orbit కి “క్లార్క్ ఆర్బిట్” అని Inter national Astromonical Union వారు పేరు పెట్టారు. క్లార్క్ 1000పైగా చిన్న కథలు వ్యాసాలు రాసారు. ఆయన రాసిన Dial.F.Frankenstein కథ ఇచ్చిన ప్రేరణతోనే బ్రిటీష్ కంప్యూటర్ సైంటిస్టు 1989 లో World Wide Web (WWW) ను ఆవిష్కరించారు.

1948లో ఆన రాసిన “The Sentinal” కథను ఆ తరువాత నవలగా మలచి, 2001 Space Udyssy గా సినీమా తీసారు. ఈ సినీమా ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని ఇచ్చింది. ఈ చిత్రంలో ‘Artificial Intellegence’ అనే పరికల్పన వుంది. తెలివితేటలలో అన్ని విధాలా మనిషిలాగే సంచరించగలిగే యంత్రం ఆయన ఊహించి కల్పించినది – త్వరలోనే వాస్తవ రూపం పొందగలదు. అన్నదే ఆయన విశ్వాసం. “నానో టెక్నాలజీ రంగంలో సంపూర్ణ అభివృద్ధి జరిగిన రోజున కృత్రిమ మేథస్సులు అత్యంత వేగంగా పుట్టుకొస్తాయని” క్లార్క్ నమ్మకంగా చెప్పారు.

అంతరిక్ష రంగ అభివృద్ధికి తోడ్పడిన క్లార్క్ అంతరిక్షంలోకి పోనేలేదు.” అంతరిక్షంలోకి పయనమై నేను పోలేదు అన్న విచారం నాకు లేదు. నా వెంట్రుకలోని DNA ను ఆర్బిట్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాను. ఎప్పుడో మరో కాలంలో ఏ సూపర్ నాగరికత జీవికో అది తారసపడుతుంది. ఆ విధంగా ఆ మరో కాలంలో నేను జీవించి వుంటాను.” అన్నారాయన.

సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారింది. అయితే ప్రపంచంలో మనుషులందరూ జాతి విభేధాలు లేకుండా స్నేహభావంతో మెలగాలి. మానవులంతా ఒకే కుటుంబంగా వుండాలి. మనము దయ, కరుణ, సహనాలు అలవరుచుకోవాలి. అదే నిజమైన ప్రపంచీకరణ – అంటాడు క్లార్క్. క్లార్క్ వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ఒక దృవతార ఆయన మరణం. ఒక యుగాంతానికి చిహ్నం అంటే అతిశయోక్తి కాదు.

లూయీ బ్రెయిలీ (1809 – 1852)

పిల్లలూ !

ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.

బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు”

పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఎదిగాడు బ్రెయిలీ.

పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు. 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.

ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.

ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.

కె.వి.కె.శర్మ, పి.ఎస్.అనంతసాగర్.

ఒట్టో వలాష్ ( క్రీ.శ. 1847 -1931 )

సుగంధ పరిమళాలు, లేపనాలు, తదితర సువాసనా ద్రవ్యాలు ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు.

భారతదేశం సుగంధాలకు మారుపేరుగా ఉండేది. సుగంధాలు పరిమళాలు ఎక్కువ భాగం సహజంగానే చెట్టు నుంచి, జంతు భాగాల నుంచి లభిస్తున్నాయి. అలాంటి సుగంధాల రసాయనిక నిర్మాణాన్ని కనుగొన్నాక వాటి లక్షణాలే ఉండే విధంగా కృత్రిమంగా కూడా సుగంధ రసాయనిక పదార్థాల్ని ప్రయోగశాలల్లోనూ, పరిశ్రమల్లోనూ తయారు చేస్తున్నారు. పాశ్చాత్య నాగరికత , వాణిజ్య మరియ జీవన విధానం అలవాటయ్యాక మధ్య తరగతి, ఉచ్చ తరగతి ప్రజానీకంలో సుగంధ ద్రవ్యాలు.

పరిమళాల వాడకం హెచ్చయ్యింది.అందాల పోటీలను నిర్వహించి వాటికి ఎప్పుడూ లేని వ్యాపార ప్రతిపత్తిని కల్పించి కోట్లు పోగేసుకుంటున్నారు. అయితే సుగంధ ద్రవ్యాలన్నీ వ్యాపార నిమిత్తమే కాకుండా సత్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఔషధాలల్లోనూ, పానీయాల్లోనూ, ఆహార పదార్థాల్లోనూ, పిండి వంటల్లోనూ, పరిసరాల పరిశుభ్రతకు కూడా వాడుకొంటున్నాము.

ఇలాంటి సత్ప్రయోజనాలను ఆశించి సుగంధ రసాయనిక పరిశోధనల మీద విస్తృత ప్రయోగాలు చేసి కీర్తి గడించిన వాడు 17.3.1847 నాడు రష్యాలో జన్మించి ఆ తరువాత జర్మనీలో స్థిరపడ్డాడు. వల్లాష్ గల్టింగన్ విశ్వవిద్యాలయంలో వోలర్ వద్ద డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. యూరియా తయారీకి పేరెన్నిక గన్న వోలర్ గురించి మీరు వినే ఉంటారు. ఆ తర్వాత 1870 లో ఆగస్ట్ కెకులే వద్ద పరిశోధనలు జరిపాడు. బెంజీన్ పదార్థంలో అణువులు సమ షష్టి భుజి నిర్మాణంలో ఉంటాయని చాటిన వాడు కేకులే. ఇంత గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయడం వల్ల వల్లాష్ కూడా గొప్ప వాడయ్యాడు. ఆయన క్రమేపి సుగంధ ద్రవ్యాల మీద మనసు పడ్డాడు. వివిధ పరిమళ ద్రవ్యాలు, రసాయనికంగా వేర్వేరని అందరూ అంతవరకు భావించేవారు. అయితే అవన్నీ కూడా టర్పీన్ లనే ఒక ప్రత్యేక తరహా రసాయనిక సమ్మేళనాల తరగతికి చెందినవని వల్లాష్ ఋజువు చేశాడు. కర్పూరం, మెంథాల్, సిట్రాల్ వంటివన్నీ టర్పీన్లే ఇలాంటి వందలాది పదార్థాలన్నింటిలోనూ ఒక రసాయనిక నిర్మాణాంశం సార్వత్రికంగా ఉన్నట్లు ఋజువు చేశారు. మొదట కేకులే కూడా ఇవన్నీ వివిధ రకాల పదార్థాలని విశ్వసించారు. వల్లాష్ ఆ రకంగా గురువును మించిన శిష్యుడయ్యాడు. సుగంధాన్ని విరజిమ్మే అనేక వందల పదార్థాలల్లో ఐసాప్రిన్ భాగం సార్వత్రికంగా ఉన్నట్లు సోదాహరణంగా, ప్రయోగ పూర్వకంగా ఋజువు చేసిన వలాష్ ను పరిమళాల పితామహుడు అంటారు. నిరాడంబరతకు, నిస్వార్థతకు పేరిన్నికగన్న వల్లాష్ చేసిన కృషికి గానూ, 1910 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమానం ఈయనను వరించి నోబెల్ బహుమతికి సుగంధం అబ్బింది.

మేరీక్యూరీ (1867 – 1934)

రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ (1867 – 1934)

తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ. 19వ శతాబ్దంలో స్త్రీలకు లలిత కళలు, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్సు చదవడానికి నిరాకరించేవారు. తన నిరంతర పరిశ్రమ, పట్టుదలతో కృషిచేసి నోబెల్ బహుమతి మొట్టమొదటగా పొందిన ధీరవనిత మేరీక్యూరీ. 1903 ఫిజిక్స్ లోను, 1911 లో కెమిస్ట్రీ లోను రెండుసార్లు నోబెల్ బహుమతులు పొంది చరిత్ర సృష్టించింది.మేరీక్యూరీ 1867 లో పోలెండ్ లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది.హైస్కూల్ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పెదరికం వల్ల చదువు మాని, 10 సంవత్సరాల పాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా గడిపింది.

24 సం. ల వయస్సులో కొంత డబ్బు కూడబెట్టుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే స్త్రీలు సైన్సు చదవడానికి వీలులేదు పొమ్మన్నారు. చివరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వచ్చి ప్రఖ్యాత పారిస్ యూనివర్శిటీలో సైన్స్ విద్యార్థినిగా చేరింది. చేరిన మరుక్షణం నుండి మేరీ తన చదువుపైనే మనసు కేంద్రీకరించి రాత్రింబవల్ళు కృషిచేసింది. పేదరికంలో మగ్గుతున్న తను కొద్దపాటి డబ్బుతో చదువుకోవాలి. ఒక చిన్న గదిలో అతి తక్కువ ఖర్చుతో, అర్థాకలితో, చలి దేశమైన ఫ్రాన్సులో ఎముకలు కొరికే చలి ఉన్నా, చేతులు కొంకర్లు పోతున్నా ఒక్కతే అర్థరాత్రి దాటేవరకు తదేక దీక్షతో చదివేది. చివరి పరీక్షలలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.

తన పరిసోధనా కృషిలో మేరీకి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పీరీక్యూరీ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అనురాగంగా మారి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారి పెళ్ళి మత విశ్వాసాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జరిగింది.

రేడియో యాక్టివ్ పదార్థం పిచ్ బ్లెండ్ మీద జరిపిన పరిసోధనా ఫలితంగా మేరీక్యూరీ, పీరీక్యూరీ 1898 లో పోలోనియం కనుగొన్నారు. మేరీ తన స్వదేశమైన పోలండ్ జ్ఞాపకార్థం ఆ కొత్త పదార్థానికి పోలోనియం అని పేరు పెట్టింది. మరికొద్ది నెలల్లోనే వారు ఉభయులూ క్యాన్సర్ చికిత్సకు అతి ప్రధానమైన రేడియంను కనుగొన్నామని ప్రకటించారు. రేడియో అణుభారం 22.5. రేడియం యురేనియం కంటే 20 లక్షల రెట్లు శక్తివంతమైనది. సీసంలో తప్ప మిగిలిన అన్నింటిలో దాని కాంతి రేఖలు ప్రసరించగలవని ఈ యువశాస్త్రవేత్తలు కనుగొన్నారు. రేడియం చాలా ఖరీదైనది. ఒక గ్రామ్ రేడియం విలువ 7 లక్షల 50 వేల గోల్టు ఫ్రాంకులు.

మేరీ పరిసోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.నోబెల్ బహుమానాన్ని పీరీ దంపతులకు ఇచ్చారు. రేడియో కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రెడియోపై రాయల్టీ పొందే అవకాశము సైన్సు ఫలితాలు సమాజం కోసం ఉపయోగపడాలన్న ఆశయంతో, తమకు రాయల్టీలు అక్కర్లేదని, విద్య, వైద్య విజ్ఞాన రంగాల్లో దానిని ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చని, రేడియంను సంగ్రహించే విదానాన్ని దేశదేశాలవారికి తెలియజేశారు. తన భర్త పీరీ మరణానంతరం ఆమె ప్రాన్సులో సార్ బోర్న్ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేసింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ X రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 1934 జూలై 4న మేరీక్యూరి మరణించింది. ఈ రేడియం కనుగొనడం ద్వారా మానవ జాతి కి ఎనలేని సేవచేసిందో ఆ రేడియం కిరణాలు అధికంగా సోకి ఆమె మరణించింది. ఆమె జీవితం బావిశాస్త్రవేత్తలకు ఆదర్శంకావాలి.

బెకెసీ గియర్గాన్ ( 1899-1972 )

బాలలూ టెలిఫోన్లు, రేడియోలు తదితర సమాచార సాధనాలకు సంబంధించిన ఒక ఇంజనీర్ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందాడంటే నమ్మగలరా ? అయినా ఇది సత్యం. బెకెసీ గియర్గాన్ స్వతహాగా టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన ఇంజనీర్. పరిశ్రమల్లో పనిచేసే పారిశ్రామిక శాస్త్రవేత్త. ఈయన మనచెవిలో ఉండే లోపలి చెవి భాగంలో స్ప్రింగులుగా మొత్తగా ఉండే కాక్లియా ఏవిధంగా పనిచేస్తుందో వివరించాడు. వినడం కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ కదా.

బెకెసీ గియార్గాన్ 1899 సంవత్సరంలో హంగెరీ లో జన్మించాడు. తరువాత అమెరికాలో స్ధిరపడ్డాడు. మనకు సెల్ ఫోన్లను ఇచ్చే ఒక సంస్ధ సీమన్స్ కంపెనీ. ఇది జర్మనీలో ఉంది. దీన్లో ఆయన ఇంజనీరుగా పనిచేశాడు. 1946 లో స్వీడన్ కు వెళ్ళి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూనే బోధన వృత్తిని కొనసాగించాడు.

అంతవరకూ పంచేద్రియాల్లో ఒకటైన చెవిఎలా పనిచేస్తుందో కొద్దోగొప్పో అందరికీ తెలిసినా, లోపలిచెవిలో వినికిడి యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. గాలిలోని ధ్వని తరంగాలు చెవిరంధ్రం ద్వారా ప్రయాణించి కర్ణభేరిని కదిలిస్తాయనీ, ఆ కంపనాలు చెవిలో ఉన్నప్పుడు చిన్న ఎముకల గొలుసుద్వారా, కాక్లియాకు ప్రయాణిస్తాయనీ మాత్రమే అంతవరకు తెలుసు. అయితే కాక్లియా ఎందుకు స్ప్రింగులాగా ఉందని గానీ ఆ తరువాత కాక్లియాలో ఏ చర్యలు జరగడం ద్వారా మెదడుకు సంకేతాలు వెళతాయన్న విషయంపట్ల ఎవరకీ అవగాహన లేదు. యాంత్రిక సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మారడమెలాగో అర్థంకాలేదు. గియర్గాన్ హార్వర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ అక్కడే చెవిపనిచేసేవిధానం పట్ల లోతైన పరిశోధనలు చేశారు. కాక్లియా నమూనాలను తయారు చేసి ఆ నమూనా గోడలు మందాన్ని మారుస్తూ వాటిలో రకరకాల ద్రవాలను నింపి ఆ ద్రవాల్లో అల్యూమినియం పొడిని కలిపి విద్యుత్ సంకేతాలు పంపేవాడు. ధ్వని తరంగాలను పంపి వివిధ ప్రాంతాల్లో వివిధ మోతాదుల్లో ధ్వని వ్యతిరేకంగా గుర్తించాడు. ధ్వనితరంగాలు కాక్లియాలోని ద్రవం గుండా ప్రయాణిస్తూ కంపనాలను కలిగిస్తాయనీ పీజో ఎలక్ట్రసిటీ లనే దృగ్వియం ద్వారా ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారతాయనీ, అవి కర్ణనాడుల ద్వారా మెదడుకు చేరుతాయని వివరించాడు.

ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1961 సంవత్సరపు వైద్యశరీర ధర్మాల రంగపు నోబెల్ బహుమతి ని గియార్గన్ కు బహుకరించారు.

పిల్లలు చూశారా ఇంజనీర్ అయినా ఇతర రంగాల్లో కూడా అవగాహన ఉండడం వల్ల అంతరీయ రంగాల పరిశోధనలెలా వీలవుతాయో ! మీరు కూడా విజ్ఞానాన్ని అన్నికోణాల్లో అవగాహన చేసుకోవాలి(ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సౌజన్యంతో)

ప్రాణి మూలాన్ని తెలియజేసిన – “ఫ్రాంసిస్ క్రిక్”

విజ్ఞానశాస్త్రం మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ వుంది. ఈనాడు జీవకణ శాస్త్రం, బయోటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, మానవిని జీవరహస్యాన్ని ఛేదించే దశకు చేరడానికి అవకాశం కల్పించిన శాస్త్రవేత్తలలో “ఫ్రాంసిస్ క్రిక్” ముఖ్యులు. ఆధునిక జీవశాస్త్ర శిల్పిగా ప్రపంచమంతా ఈయనను గుర్తించింది.

ఫ్రాంసిస్ క్రిక్” తన మిత్రుడైన జేమ్స్ వాట్స న్ తో కలిసి “D.N.A” (డీఆక్సీ రైజో న్సూక్లి క్ ఆసిడ్)

నిర్మాణాన్ని బహిర్గతం చేయడం జన్యుశాస్త్ర విస్తరణకు ఎంతగానో తోడ్పడింది. వీరి పరిశోధనలు 19వ శతాబ్దపు డార్విన్ పరిణామ సిద్ధాంతం, మెండల్ అనువంశిక సిద్ధాతాల కొనసాగింపుగా బావించవచ్చు.

మనం నేడు జీవశాస్త్ర లోతుల్లోకెళ్ళి జన్యు మార్పిడి ద్వారా జీవి లక్షణాన్ని మార్చగలిగే స్థాయికి చేరేందుకు పునాదు లేసిన ఫ్రాంసిక్ క్రిక్ ప్రారంభదశలో జీవశాస్త్ర వేత్తకాదంటే నమ్మబుద్దికాదు. ఈయన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో భౌతిక పరిశోధనా విద్యార్థిగా వున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కాలంలో ఆయనకు జీవశాస్త్రం పై అభిరుచి కలిగి జీవరసాయన శాస్త్రాల అధ్యయనానికి పూనుకొన్నాడు. కణరసం భౌతిక లక్షణాలపై పరిశోధన చేపట్టాడు. క్రమంగా జన్యువుల అమరికను గురించి అర్థంచేసుక ని, అమైనో ఆమ్లాల ఆధారితమైన “D.N.A” యొక్క రూపాన్ని అవిష్కరించారు. జేమ్స్ వాట్స న్ తో కలిసి క్రిక్ చేసిన పరిశోధనకు 1962 లో నోబెల్ బహుమతి లభించింది.

ఆనాటికి క్రిక్ కు డాక్టరేట్ కూడాలేదు. క్రిక్ తన పరిశోధన కొనసాగింపుగా జీవి శరీర నిర్మాణానికి కీలకమైన మాంసకృత్తులు ఏరంకంగా తయారవుతాయో తెలిపాడు.

క్రిక్ జీవితం కూడా ఆదర్సప్రాయం. నిరాడంబర జీవితం గడిపారు. బహుమతులకు వెంపర్లాడలేదు. ప్రపంచ స్థాయిలో తాను పొందిన గుర్తింపును ప్రచారాలకు వ్యాపారానికీ వాడుకోలేదు. అందుకే ఆయనకు 1999లో ఇంగ్లాండ్ దేశ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. ప్రజా సైన్స్ ఉద్యమాల మార్గదర్శి డా. డె.డి. బెర్నాల్ వంటివారి పరిశోధనలు, క్రిక్ పరిశోధనల ప్రభావితం చెయ్యడం మరో విశేషం.

తన పరిశోధనా ఫలితాల పునాదులపై విస్తరిస్తన్న జీవసాంకేతిక రంగాన్ని క్రిక్ తన జీవిత కాలంలోనే చూడగలడం విశేషం. మానవ జన్యువు లక్షణాలు విశదంగా క్రోడీకరించగల శాస్త్రరంగ అన్వేషణ క్రమంలేనే ఫ్రాసిస్ క్రిక్ 2004 జూలై 28వతేది (తన 88వ ఏఠ) తనువు చాలించాడు. ప్రజాశాస్త్రవేత్తగా మన హృదయాలలో నిలిచిపోయాడు.

First blog post

సింహము-కుందేలు కథ

ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహం నివశిస్తుంది. అది చాలా పొగరుబోతు, ఎంతో పౌరషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదలగల క్రూర జంతువు. ఆ అడవిలో అది ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని ఎదురించే బలం ఏ మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వంతో ప్రతి జంతువునూ భయపెడుతూ, తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయేవి.

ఒకనాడవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారంగా వెళ్ళాలనినిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థన అంగీకరించి, తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం. అవన్నీ కూడపలుక్కుని కలిసి కట్టుగా వెళ్ళి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి. “రోజూ ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నింటినీచంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తరువాత ఆకలితో నేనూ అవస్థ పడవలసి వస్తుంది” అని మనసులోనే అనుకొని అందుకు అంగీకరించింది. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని, మృగాల మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజూ మధ్యాహ్నంఅయ్యేసరికి మీలో ఒకరునాకు ఆహారంగా నాముందు నిలబడాలి, ఆలస్యం చేసినా, మతిమరుపు చూపించినా మీ అంతు చూస్తాను. మాటంటే మాటే గుర్తుంచుకోండి అని గద్దించింది.

ఆ రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారంగా వెళుతున్నాయి. సింహం వేట మానేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. చక్కగా ఆలోచించగలదు. ఆనాడు ఎలాగైనాఆపద నుండి బయట పడాలనిమంచి ఉపాయం ఆలోచించింది. అన్ని జంతువుల మాదిరగా కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. అప్పటికే వేళ దాటిపోతున్నప్పటికీ ఆహారంగా ఏ జంతువూ రాకపోయేసరికి సింహం మండిపడుతూ ఉంది. దానికి తోడు ఆకలి బాధ ఎక్కువైంది. సింహం కోపంతో గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది. సింహం దానిని చూచి “ఓరీ!నీవా! నీకెంత పోగరురా! ఎందుకింత ఆలస్యం చేశావ్?” అని పెద్దగా గద్దించింది.

కుందేలు గజగజా వణుకుతూ “మహారాజా! నేను మామూలు సమయానికే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను. కాని దారిలో ఇంకొక సింహం కనిపించింది. తానే అడవి అంతటికీ రాజునని, తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు లేరని, నన్ను తనకి ఆహారం అవమని అడుగు ముందుకు వేయనీయక అడ్డం తగిలి నన్ను ఆపేసింది. నేను అతి కష్టం మీద దానిని ఒప్పించి “మా రాజును నీ వద్దకు తీసుకొని వస్తా”నని ప్రమాణం చేసి తమ వద్దకు పరుగెత్తుకు వచ్చాను. పొగరుతో కన్నూ, మిన్నూ కానరాక తమను నిందించిన ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి. పాపం తమరు ఎంతో ఆకలిగా ఉన్నారు, ముందు నన్ను ఆరగించండి” అన్నది కుందేలు.

సింహం గట్టిగా గర్జించి కనులెగరేసి “ఆ పొగరుబోతు ఎక్కడుందో చూపించు ముందు, నిన్ను నిందిస్తూ నిన్నడ్డగించిన ఆ పిరికిపందకు తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను. నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు? పద ముందు వాని దగ్గరకు వెళ్దాం” అని అన్నది. సింహాన్ని కుందేలు ఒక పాడుపడిన బావి దగ్గరకి తీసుకొని వెళ్ళింది. “మహారాజా! నన్నడ్డగించి మిమ్ము నానా మాటలు అన్న సింహం ఈ నూతిలోనే దాగి ఉంది వెళ్ళిచంపండి” అన్నది.

కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొకమారు గర్జించింది. నూతిగట్టు మీదకెక్కి అందులోకి తొంగిచూసింది. నీటిలో దాని నీడ కనపడింది. అది తన విరోధి అని భావించి, పంజా ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకింది. కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. మృగాలన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. శత్రువు మరణించినందువలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపాయి.

కాబట్టి బుద్ధిబలం గలవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అలాంటి బుద్ధిబలాన్ని ఉపయోగించి సంజీవక పింగళకులకు విరోధం కలిగిస్తాను. అందుకు కాలం కూడా ఇపుడే కలిసి వచ్చింది. రాజద్రోహం చేసినందుకు పదవులు పోగొట్టుకొని ఉన్న మన కాటక-పాటకులు సంజీవకుని ఆశ్రయిస్తున్నారు. అతనిని నమ్ముకొన్నచో రాజునకు చెప్పి ఎలాగైనా తమ పదవులను తిరిగి తమకు ఇప్పిస్తాడని వాటి నమ్మకం. ఈ అవకాశాన్నుపయోగించుకొని ఎద్దు మీద నేరాలు మోపి అతని మీద ఉన్న స్నేహ భావం తొలిగించి, రాజుగారి మనస్సుని మారుస్తాను అని దమనకుడు చెప్పగా విని కరటకుడు నీకు విజయం కలుగు గాకా! క్షేమంగా పోయి లాభంగా తిరిగి రా” అని పలికింది.

దమనకుడు పింగళకుని వద్దకు పోయి నమస్కరించి “మహారాజా! మన్నించండి. పిలవని పేరంటంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. తమరి ఉప్పు తిని నీడన పడి ఉండేవాడిని. తమ మేలు కోరి ఒక రహస్య విషయం మనవి చేయాలని వచ్చాను” అన్నాడు. వెంటనే పింగళకుడు “దమనకా! నీ కంటే నాకు మంచి ఆప్తులెవరున్నారు? సందేహించకు, నీవు చెప్పదలచిన విషయం నాకు నిర్భయంగా చెప్పు. భయపడవలసిన పని లేదు” అని పలికింది.

మహారాజా! మీరు మనసారా ప్రేమిస్తున్న సంజీవకుడు ఇపుడు మునిపటివలే లేడు. అతనికి మీ రాజ్యం కాజేయాలనే ఆశ పుట్టింది. మిమ్ములను సంహరించి ఈ అడవికి తానే రాజు కావాలని కోరిక కలిగింది. అతడిప్పుడు రాజద్రోహులైన కాటక పాటకులతో కలిసి కుట్ర చేస్తున్నాడు, ఇది తెలిసినప్పటినుండి నా మనసు మనసులో లేదు. ఎప్పుడు ఈ వార్తను మీ చెవిన వేయాలా అని నిరీక్షిస్తున్నాను. నేడు తమతో మనవి చేసే అవకాశం దొరికింది అని అన్నది.

మంత్రి పదవి ఇచ్చి ఎంతో గౌరవంగా చూస్తూ ప్రాణస్నేహితునిగా నమ్మానే! ఇలాంటి ద్రోహం తలపెడతాడా? నీ మాట నిజమని నమ్మమంటావా? అన్నాడు పింగళకుడు. వెంటనే దమనకుడు “ప్రభువులు నా వంటివారు నిజం చెప్పినా నమ్మరు, కారణం నాకు పదవి లేకపోవడమే. నీచులకు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు. పాములను తలపై పెట్టుకొని పూజించినా కాటు వేయడం మానదు కదా! సంజీవకుడు త్వరలో మీతో యుద్ధమునకు రావడానికి ఆలోచిస్తున్నాడు. మొదట అతని గుణం తెలియక నేనే మీ వద్దకు తీసుకు వచ్చి మీకు నచ్చచెప్పి మంత్రి పదవి ఇప్పించాను కదా! అట్టి వానిని నమ్మవద్దని ఎందుకు చెప్పుచున్నానో ఆలోచించండి” అనిమరొకమారు హెచ్చరించింది.

“మరైతే సంజీవకుణ్ణి వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగిస్తాను. ఆ తరువాత ఈ అడవి నుండి తరిమేద్దాం” అని మృగరాజు పలుకగా, దమనకుడు”శాంతించండి మహారాజా! ఎంతకాలం నుండో మహారాజుగా ఉండి ఒక్కసారి ఆమాంతం శత్రువుగా మారితే అతడు వెంటనే తమకు అపకారం తల పెట్టవచ్చు”నని దమనకుడు పలికాడు. పింగళకుడు నవ్వి “నాకే అపకారం తలపెట్టేటంతటి వాడా అతడు!” అని తేలిక భావంతో అన్నాడు.

దానికి దమనకుడు “ప్రభువుల వారికి తెలియనిది కాదు, ఇతరుల స్వభావం తెలియక వారికి నివాసం కల్పించి పదవులీయడం మనది మొదటి తప్పు. అతని స్వభావం ఇలాంటిదని మనకు తెలిస్తే మనలో చేరనిచ్చేవారమా? స్వభావం తెలియక మిత్రుడని నమ్మి నల్లికి చోటిచ్చి చీరపోతు తన ప్రాణం పోగొట్టుకుంది. మీకా కథ చెపుతాను వినండి అని దమనకుడు కథ చెప్పటం ప్రారంభించింది.

This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.